"సర్ ఖైదీ నం.842 (ఉరిశిక్ష పడిన నక్సలైట్ ఖైది)ప్రసిడెంట్ ఆఫ్ ఇండియా పేరిట మృత్యుపత్రం రాస్తానంటున్నాడు". అని సీనియర్ జైలర్, జైలు సూపరిన్ టెన్ డెంట్ కు సాల్యూట్ చేసి విన్నవించుకున్నాడు..........
ఆలకించిన జైలు సూపరిన్ టెన్ డెంట్ తల కిందకి పైకి ఆడించి "సరే ఆఫీసు టయిము అయిపోయాక టైపిస్ట్ ను, ఆ సరంజామాను తీసుకొని ఫాసీ గేటు వద్దకు రా ..."
.....గంటకోట్టగానే ఫాసీ గేటు జైలర్,సీనియర్ జైలర్,ఇద్దరు హవల్దార్లు,నలుగురు వార్డర్లు,ఓ టైపిస్ట్,ఓ టేబుల్,పెట్రోమాక్స్ లైట్,రెండు కుర్చీలు తీసుకొని జైలు సూపరిన్ టెన్ డెంట్ గ్లాడ్ సాబ్ ఫాసి గేటు కేసి వచ్చాడు.
వీరిని చూసిన ఖైదీ .." హ్యావ్ ఏ సీట్ మిస్టర్ గ్లాడ్" అన్నాడు వీర భూషణ్ పట్నాయక్ ( ఖైది నం.842 )..........
"కెన్ ఐ డిక్టేట్ నౌ ?" అన్నాడు తిరిగి ............ " యస్ ....యస్ .... గొణిగాడు సూపరిన్ టెన్ డెంట్ గ్లాడ్ .
..........దేశపు ఈనాటి నిరంకుశ ప్రభుత్వపు నామ మాత్రపు అధ్యక్ష మహాశయునికి!
మహాశయా!
రాజమండ్రి సెంట్రల్ జైలులో మీ ప్రభుత్వం విధించిన ఉరి శిక్ష కై ఎదురు చూస్తున్న నేను ...... ఖైది నం.842 వీర భూషణ పట్నాయక్ ను మరొక్కమారు ఆత్మాభిమానంతో మీకు తెలియజేయు అంశాలు:
నేను కమ్యూనిస్ట్ ను,మార్క్స్,లెనిన్,మావోల సిద్ధాంతాలు, ఆలోచనల పైన నాకు అపారమైన గౌరవం, నమ్మకం, విశ్వాసం.నా దేశపు నాతోటి సోదరులు, మీ నిరంకుశ ప్రభుత్వ కఠోర కబంద హస్తాలనుండి కేవలం శస్త్రకాంతి వల్లనే విముక్తులు కాగలరని నా అచంచల విశ్వాసం.అందుకే శ్రీకాకుళం ఉద్దానంగిరిజన ప్రాంతాలలో నేను,నా సహచరులు చేసిన అసఫల ప్రయత్నం సరయినదే అని మళ్ళి మళ్ళి నొక్కి చెప్పటానికి నేను గర్విస్తున్నాను.
మీ ఆయుధఫాణులయిన సైనిక బలగాలు మాలాంటి క్రాంతి వీరుల చిన్న సమూహాలపయిన సాధించిన విజయం ఓ కొత్త శారిత్రను సృష్టిస్తుంది. ఈ తాత్కాలిక పరాజయంతో మా కామ్రేడ్స్ నీతి,ధైర్యం ఏమాత్రం సన్నగిల్లలేదు,అడుగంటలేదు. ఒక్క మాట ఈ సందర్భంగా ' కేవలం విజయగర్వంతో కాదు మానవచరిత్ర మొదలయింది.సమర్పిత దారుణ పరాజయాల పరంపర నుండి. ఈ చరిత్ర అప్పటినుండి ఇప్పటికీ అలాగే నడుస్తుంది.ఇది మాకు తెలుసు చరిత్ర అధ్యయనం చేస్తే మీకూ అవగతం కాగలదు.
...........అందుకే ఈనిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ప్రజలలో ఒకడిగా నేను ప్రాణ యాచన చేయను గాక చేయను, చేయబోను. నేనే గనుక అలాచేస్తే కష్టించి నిజాయతీతో పనిచేసే నాతోటి క్రాంతి సోదరుల శక్తి యుక్తులను అవమానించినట్లే.అంతేకాదు మాలాంటి ప్రజలను పీల్చి పిప్పిచేసే ప్రభుత్వాన్ని గౌరవించినట్లు,సన్మానించినట్టు అవుతుంది.అయినా మీ న్యాయస్థానం విధించిన శిక్ష మాత్రమే మీరు నాపట్ల అమలు పరచాలని,అన్నిటికన్నా ముఖ్యం నా సంపద వాటిపయ్ మీకూ ఎలాంటి హక్కు లేనందున, నానుంచి మీరు నాసంపదను లాక్కోవద్దని కోరుతున్నాను.
నేను కమ్యునిస్టును,మా సిద్ధాంతం ప్రకారం శ్రమయే మాధనం.ఆ శ్రమకు సాధనం శరీరం కాబట్టి శరీరం కూడా మానవుని వ్యక్తిగత ధనంలో ఓ భాగం. ఆ ధనాన్ని తన వారసులకివ్వడం నేటి మీ రాజ్యాంగం పరంగా చూసినా ప్రతి మనిషికి చట్టపరంగా ఉన్న హక్కు అన్న విషయాన్ని మీకు మరో మారు గుర్తు చేస్తున్నాను. ఆ నాహక్కును నేను వినియోగించుకోవడానికి నాతో సహకరిస్తారని ఆశిస్తున్నాను.
........ టైపిస్టు నిర్వికారంగా టైపు చేస్తున్నాడు.... గ్లాడ్ సాబ్ మాత్రం ఎన్నడూ,ఎవ్వరూ కనీ వినీ ఎరుగని ఈ మృత్యు పత్రాన్ని వింటూ తన్నుతాను మరచిపోతున్నాడు.ఇవేమీ పట్టనట్టు ఖైదీ నం 842 వీర భూషణ పట్నాయక్ డిక్టేట్ చేస్తున్నాడు.
మీ ప్రభుత్వానికి,మీ న్యాయస్థానానికి కావలసింది కేవలం నా ప్రాణం. నా ధనంతో మీ కేమి పని లేదు.అలాంటప్పుడు నన్ను ఉరితీసి,ఆతర్వాత పోస్ట్ మార్టం చేసి నా శరీరాన్ని ( నా ధనాన్ని ) నాశనం ఎందుకు చేస్తారు? అలాగయితే నా శరీర సంపదను ఎవరికీ ఉపయోగించని విధంగా నేను నా సంపద (శరీరం) కోల్పోతాను.నాదేశ ప్రియ భాంధవులకోసం,నా ప్రియమయిన కార్మిక,కర్షక సోదరులకోసం నా శరీరంలోని ఆణువణువూ ధారపోయాలన్నదే నా ఆశ,ఆకాంక్ష.అందుకే మీ ప్రభుత్వానికి,మీకు తెలియపరుస్తూ,నా ఆశయసాఫల్యతకు సహకరించ వలసిందిగా కోరుచున్నాను.కనీసం మీ రాజ్యాంగంలోనే నాకున్న హక్కును,గౌరవించి నా కోర్కె సాఫల్యతకు సహకరించండి...... నన్ను ఉరితీసి నా శరీరాన్ని పోస్ట్ మార్టం చేసి ఎందుకు ఎవరికి ఉపయోగపడకుండా నా కాయాన్ని అవతల పారేయడం,అదే ఖననం చేయడమో,కాల్చి బూడిద చేయడమో చేయకండి.అందుకు బదులుగా నిపుణులయిన వైద్యుల పర్యవేక్షణలో నేను జీవించి ఉండగానే నా శరీర అవయవాలు, కళ్ళు,కిడ్నీలు,లివర్,గుండె,ఊపిరితిత్తులు,రక్తం,మూలుగు,ఎముకలు,ప్రేగులు,ఎలా ఏవి పనికి వస్తాయో అవన్నీ తీయించి వాటి అవసరం గల పేదరోగులకు ఉపయోగించండి.ఈ ప్రక్రియలో నాలో చలనం ఎప్పుడు ఆగిపోతే అప్పుడు నేను చనిపోయినట్లు ప్రకటించండి.
........గ్లాడ్ సాబ్ జేబులోంచి విస్కీ సీసా తీసి తనకు తెలియకుండానే నక్సల్ ఖైదీ ముందుకు చాపాడు. వీర భూషణ్ పట్నాయక్ వద్దన్నట్టు తల అడ్డంగా ఊపగానే సీసా తన గొంతులో కొంత వంపుకొని మూతబిగించి జేబులో పెట్టుకొని ఆసక్తికరంగా వింటున్నాడు ఖైదీ వీలునామాని.
ఇతరులకు ఉపయోగపడే అన్ని అవయవాలు తీసాక,ఎవరికి,ఏవిధంగాను పనికిరాని నా మిగిలిన శరీరాన్ని ఎవరికి కష్టం కాని విధంగా, కాల్చో,ఖననం చేసో ఏదోవిధంగా చిద్రం చేయండి.అంతేగాని ఏవిధమయిన ధార్మిక సంస్కారాలు నా శరీరానికి జరపవద్దని కోరుకుంటున్నాను.ఇకపోతే ఈ దేశంలోని ఏప్రాంతం వాడయినా,ఏ ధర్మం వాడయినా,ఏజాతి వాడయినా, నా శరీరం నుండి సేకరించిన అవయవాలతో అవసరం పడితే స్వేచ్చగా ఏవిధమయిన ప్రతిఫలం ఎవరికి చెల్లించకుండా పూర్తి ఉచితంగా పొందవచ్చు. అయితే ఒక షరతు నా శరీరంలోని ఏ అవయవమయినా కావలసిన వారిలో ముందుగా భూమిలేని పేద రైతు కూలీలకు,గిరిజనులకు,ఆకుసలరు అయిన చిన్న కార్మికులకు,అ తదుపరి శ్రామికులకు,సన్నకారు రైతులు,స్వతంత్ర కార్మికులు, చిన్న సైజు కుటీర పరిశ్రమలవారికి,ఆ తర్వాత బుద్ధిజీవులయిన,ఉపాధ్యాయ,అధ్యాపక,డాక్టర్,ఇంజనీర్లకు,కళాకారులకు,ఇతరేతర ఏ మధ్యతరగతి బుద్ధిజీవికయినా వినియోగించవచ్చు.నా ఈ ప్రాధాన్యతా క్రమంలో ఎవరికి అవసరం లేని పక్షంలో దేశంలోని ఏ పేద వ్యక్తి కయినా, యాచకులకయినా ఉచతంగా నా శరీర అవయవాలను వినియోగించ వచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోను,భారీపరిశ్రమ పెట్టుబడిదార్లకు,భూస్వాములకు,జమిందార్లకు,ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో వున్నా అధికార్లకు, మంత్రులకు,పోలీసు,మిలటరీ, ఏరాంకువాడికయినా నా అవయవాలు వినియోగించవద్దని ప్రత్యేకంగా కోరుచున్నాను.మీ ప్రభుత్వం నా ఈ అభీష్టాన్ని,హక్కును సరిగా అర్ధం చేసుకొని గౌరవిస్తదని,సరిగా ఆలోచించి,అమల్లో పెడతారని,నా పేద సోదరులకు నా ఆణువణువూ ఉపయోగపడే విధంగా,నా ఆలోచనాపరంగా తగు రీతిలో నా శరీర సంపద ఉపయోగ పడుతుందని అందుకు సహకరిస్తారని ఆశిస్తాను. రాష్ట్రపతిగా మీరు స్వయంగా ఈ నా శరీర సంపద వినియోగ విషయంలో జోక్యం చేసుకొని నా అభీష్టానికి సహకరించండి.
ఈ విషయంలో అవసరం అయితే చట్టంలో ఏవయినా మార్పులు చేయవలసి వచ్చినా ఆ చట్ట సవరణలు చేసయినా నా సంపద పై నాకువున్న సహజ అధికారాన్ని నన్ను వినియోగించుకోనిమ్మని కోరుతూ,తమ నిర్ణయాదికారానికై,ఎదురు చూస్తుంటాను........ టైపిస్ట్ ఆగగానే సీనియర్ జైలర్ ముందుకొచ్చి పేపర్స్ అన్ని సరిగా నాలుగు సెట్లుగా సర్ది పిన్ చేసి ఖైదీ నం:842 కు అందించాడు.అతడోసారి చదివి పూర్తి సంతృప్తితో సంతకం చేసాడు.జైలర్ వాటిని భద్రంగా తీసుకొని గ్లాడ్ సాబ్ కు అందించాడు వినయంగా. "ఖైదీ నా సమక్షం లో ఎవరి వత్తిడి లేకుండా వ్రాసాడని" సర్టిఫై చేసి సంతకం చేసాడు.జమేదార్ కుర్చీ తీసుకేల్లుతున్నాడు,గ్లాడ్ బయటకు వెళ్లబోయే వాడల్లా ద్వారం వద్ద ఆగి ఓ క్షణం ఖైదీ కేసి నఖ శిఖ పర్యంతం పరిశీలించాడు.ఒకఆడుగు ఖైదీ కేసి వేసి చేతిలోని క్యాప్ స్టన్ సిగరెట్ టిన్ నక్సలైట్ కేసి చూపుతూ అన్నాడు " డూ యూ లైక్ ఇట్ ".
ఏదో గొణుక్కుంటూ పట్నాయక్ ఓ సిగరెట్ అందుకున్నాడు. వెంటనే పూర్తి టిన్ను ఖైదీ చేతిలో ఉంచుతూ "కీప్ ఇట్ విత్ యూ "అంటూ గ్లాడ్ సబ్ బయటకు నడిచాడు...................
మై డియర్ ఫ్రెండ్స్ నేను ఈ మృత్యుపత్రం(వీలునామా) ను మరాటి లో అనీల్ బర్వే వ్రాసిన'థాంక్ యు మిస్టర్ గ్లాడ్' కు శ్రీమతి కె.సుజనాదేవి తెలుగు సేతలో చదివాను. నన్ను ఉద్విగ్న పరచింది ఈ రచన దాంతో మీకు కూడా పరిచయం చేయాలనిపించి మీ ముందుంచుతున్నాను. నాద్రుస్టిలో అనీల్ బర్వే ఇప్పుడు లేడు కాబట్టి ఈ రచనతో ఆతని జన్మ ధన్యమయినదని భావిస్తూ అతనికి జోహార్లు చెప్పుతున్నాను.ఇకపోతే సుజనాదేవి గారు ఈ నవలను తెలుగు చేయడం ద్వారా ఆమె తెలుగు రచనా రంగానికి యెనలేని సాహితీ సేవ చేసారని భావిస్తూ ఆమెకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. .........
ఆలకించిన జైలు సూపరిన్ టెన్ డెంట్ తల కిందకి పైకి ఆడించి "సరే ఆఫీసు టయిము అయిపోయాక టైపిస్ట్ ను, ఆ సరంజామాను తీసుకొని ఫాసీ గేటు వద్దకు రా ..."
.....గంటకోట్టగానే ఫాసీ గేటు జైలర్,సీనియర్ జైలర్,ఇద్దరు హవల్దార్లు,నలుగురు వార్డర్లు,ఓ టైపిస్ట్,ఓ టేబుల్,పెట్రోమాక్స్ లైట్,రెండు కుర్చీలు తీసుకొని జైలు సూపరిన్ టెన్ డెంట్ గ్లాడ్ సాబ్ ఫాసి గేటు కేసి వచ్చాడు.
వీరిని చూసిన ఖైదీ .." హ్యావ్ ఏ సీట్ మిస్టర్ గ్లాడ్" అన్నాడు వీర భూషణ్ పట్నాయక్ ( ఖైది నం.842 )..........
"కెన్ ఐ డిక్టేట్ నౌ ?" అన్నాడు తిరిగి ............ " యస్ ....యస్ .... గొణిగాడు సూపరిన్ టెన్ డెంట్ గ్లాడ్ .
..........దేశపు ఈనాటి నిరంకుశ ప్రభుత్వపు నామ మాత్రపు అధ్యక్ష మహాశయునికి!
మహాశయా!
రాజమండ్రి సెంట్రల్ జైలులో మీ ప్రభుత్వం విధించిన ఉరి శిక్ష కై ఎదురు చూస్తున్న నేను ...... ఖైది నం.842 వీర భూషణ పట్నాయక్ ను మరొక్కమారు ఆత్మాభిమానంతో మీకు తెలియజేయు అంశాలు:
నేను కమ్యూనిస్ట్ ను,మార్క్స్,లెనిన్,మావోల సిద్ధాంతాలు, ఆలోచనల పైన నాకు అపారమైన గౌరవం, నమ్మకం, విశ్వాసం.నా దేశపు నాతోటి సోదరులు, మీ నిరంకుశ ప్రభుత్వ కఠోర కబంద హస్తాలనుండి కేవలం శస్త్రకాంతి వల్లనే విముక్తులు కాగలరని నా అచంచల విశ్వాసం.అందుకే శ్రీకాకుళం ఉద్దానంగిరిజన ప్రాంతాలలో నేను,నా సహచరులు చేసిన అసఫల ప్రయత్నం సరయినదే అని మళ్ళి మళ్ళి నొక్కి చెప్పటానికి నేను గర్విస్తున్నాను.
మీ ఆయుధఫాణులయిన సైనిక బలగాలు మాలాంటి క్రాంతి వీరుల చిన్న సమూహాలపయిన సాధించిన విజయం ఓ కొత్త శారిత్రను సృష్టిస్తుంది. ఈ తాత్కాలిక పరాజయంతో మా కామ్రేడ్స్ నీతి,ధైర్యం ఏమాత్రం సన్నగిల్లలేదు,అడుగంటలేదు. ఒక్క మాట ఈ సందర్భంగా ' కేవలం విజయగర్వంతో కాదు మానవచరిత్ర మొదలయింది.సమర్పిత దారుణ పరాజయాల పరంపర నుండి. ఈ చరిత్ర అప్పటినుండి ఇప్పటికీ అలాగే నడుస్తుంది.ఇది మాకు తెలుసు చరిత్ర అధ్యయనం చేస్తే మీకూ అవగతం కాగలదు.
...........అందుకే ఈనిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడే ప్రజలలో ఒకడిగా నేను ప్రాణ యాచన చేయను గాక చేయను, చేయబోను. నేనే గనుక అలాచేస్తే కష్టించి నిజాయతీతో పనిచేసే నాతోటి క్రాంతి సోదరుల శక్తి యుక్తులను అవమానించినట్లే.అంతేకాదు మాలాంటి ప్రజలను పీల్చి పిప్పిచేసే ప్రభుత్వాన్ని గౌరవించినట్లు,సన్మానించినట్టు అవుతుంది.అయినా మీ న్యాయస్థానం విధించిన శిక్ష మాత్రమే మీరు నాపట్ల అమలు పరచాలని,అన్నిటికన్నా ముఖ్యం నా సంపద వాటిపయ్ మీకూ ఎలాంటి హక్కు లేనందున, నానుంచి మీరు నాసంపదను లాక్కోవద్దని కోరుతున్నాను.
నేను కమ్యునిస్టును,మా సిద్ధాంతం ప్రకారం శ్రమయే మాధనం.ఆ శ్రమకు సాధనం శరీరం కాబట్టి శరీరం కూడా మానవుని వ్యక్తిగత ధనంలో ఓ భాగం. ఆ ధనాన్ని తన వారసులకివ్వడం నేటి మీ రాజ్యాంగం పరంగా చూసినా ప్రతి మనిషికి చట్టపరంగా ఉన్న హక్కు అన్న విషయాన్ని మీకు మరో మారు గుర్తు చేస్తున్నాను. ఆ నాహక్కును నేను వినియోగించుకోవడానికి నాతో సహకరిస్తారని ఆశిస్తున్నాను.
........ టైపిస్టు నిర్వికారంగా టైపు చేస్తున్నాడు.... గ్లాడ్ సాబ్ మాత్రం ఎన్నడూ,ఎవ్వరూ కనీ వినీ ఎరుగని ఈ మృత్యు పత్రాన్ని వింటూ తన్నుతాను మరచిపోతున్నాడు.ఇవేమీ పట్టనట్టు ఖైదీ నం 842 వీర భూషణ పట్నాయక్ డిక్టేట్ చేస్తున్నాడు.
మీ ప్రభుత్వానికి,మీ న్యాయస్థానానికి కావలసింది కేవలం నా ప్రాణం. నా ధనంతో మీ కేమి పని లేదు.అలాంటప్పుడు నన్ను ఉరితీసి,ఆతర్వాత పోస్ట్ మార్టం చేసి నా శరీరాన్ని ( నా ధనాన్ని ) నాశనం ఎందుకు చేస్తారు? అలాగయితే నా శరీర సంపదను ఎవరికీ ఉపయోగించని విధంగా నేను నా సంపద (శరీరం) కోల్పోతాను.నాదేశ ప్రియ భాంధవులకోసం,నా ప్రియమయిన కార్మిక,కర్షక సోదరులకోసం నా శరీరంలోని ఆణువణువూ ధారపోయాలన్నదే నా ఆశ,ఆకాంక్ష.అందుకే మీ ప్రభుత్వానికి,మీకు తెలియపరుస్తూ,నా ఆశయసాఫల్యతకు సహకరించ వలసిందిగా కోరుచున్నాను.కనీసం మీ రాజ్యాంగంలోనే నాకున్న హక్కును,గౌరవించి నా కోర్కె సాఫల్యతకు సహకరించండి...... నన్ను ఉరితీసి నా శరీరాన్ని పోస్ట్ మార్టం చేసి ఎందుకు ఎవరికి ఉపయోగపడకుండా నా కాయాన్ని అవతల పారేయడం,అదే ఖననం చేయడమో,కాల్చి బూడిద చేయడమో చేయకండి.అందుకు బదులుగా నిపుణులయిన వైద్యుల పర్యవేక్షణలో నేను జీవించి ఉండగానే నా శరీర అవయవాలు, కళ్ళు,కిడ్నీలు,లివర్,గుండె,ఊపిరితిత్తులు,రక్తం,మూలుగు,ఎముకలు,ప్రేగులు,ఎలా ఏవి పనికి వస్తాయో అవన్నీ తీయించి వాటి అవసరం గల పేదరోగులకు ఉపయోగించండి.ఈ ప్రక్రియలో నాలో చలనం ఎప్పుడు ఆగిపోతే అప్పుడు నేను చనిపోయినట్లు ప్రకటించండి.
........గ్లాడ్ సాబ్ జేబులోంచి విస్కీ సీసా తీసి తనకు తెలియకుండానే నక్సల్ ఖైదీ ముందుకు చాపాడు. వీర భూషణ్ పట్నాయక్ వద్దన్నట్టు తల అడ్డంగా ఊపగానే సీసా తన గొంతులో కొంత వంపుకొని మూతబిగించి జేబులో పెట్టుకొని ఆసక్తికరంగా వింటున్నాడు ఖైదీ వీలునామాని.
ఇతరులకు ఉపయోగపడే అన్ని అవయవాలు తీసాక,ఎవరికి,ఏవిధంగాను పనికిరాని నా మిగిలిన శరీరాన్ని ఎవరికి కష్టం కాని విధంగా, కాల్చో,ఖననం చేసో ఏదోవిధంగా చిద్రం చేయండి.అంతేగాని ఏవిధమయిన ధార్మిక సంస్కారాలు నా శరీరానికి జరపవద్దని కోరుకుంటున్నాను.ఇకపోతే ఈ దేశంలోని ఏప్రాంతం వాడయినా,ఏ ధర్మం వాడయినా,ఏజాతి వాడయినా, నా శరీరం నుండి సేకరించిన అవయవాలతో అవసరం పడితే స్వేచ్చగా ఏవిధమయిన ప్రతిఫలం ఎవరికి చెల్లించకుండా పూర్తి ఉచితంగా పొందవచ్చు. అయితే ఒక షరతు నా శరీరంలోని ఏ అవయవమయినా కావలసిన వారిలో ముందుగా భూమిలేని పేద రైతు కూలీలకు,గిరిజనులకు,ఆకుసలరు అయిన చిన్న కార్మికులకు,అ తదుపరి శ్రామికులకు,సన్నకారు రైతులు,స్వతంత్ర కార్మికులు, చిన్న సైజు కుటీర పరిశ్రమలవారికి,ఆ తర్వాత బుద్ధిజీవులయిన,ఉపాధ్యాయ,అధ్యాపక,డాక్టర్,ఇంజనీర్లకు,కళాకారులకు,ఇతరేతర ఏ మధ్యతరగతి బుద్ధిజీవికయినా వినియోగించవచ్చు.నా ఈ ప్రాధాన్యతా క్రమంలో ఎవరికి అవసరం లేని పక్షంలో దేశంలోని ఏ పేద వ్యక్తి కయినా, యాచకులకయినా ఉచతంగా నా శరీర అవయవాలను వినియోగించ వచ్చు. కానీ ఎట్టి పరిస్థితుల్లోను,భారీపరిశ్రమ పెట్టుబడిదార్లకు,భూస్వాములకు,జమిందార్లకు,ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో వున్నా అధికార్లకు, మంత్రులకు,పోలీసు,మిలటరీ, ఏరాంకువాడికయినా నా అవయవాలు వినియోగించవద్దని ప్రత్యేకంగా కోరుచున్నాను.మీ ప్రభుత్వం నా ఈ అభీష్టాన్ని,హక్కును సరిగా అర్ధం చేసుకొని గౌరవిస్తదని,సరిగా ఆలోచించి,అమల్లో పెడతారని,నా పేద సోదరులకు నా ఆణువణువూ ఉపయోగపడే విధంగా,నా ఆలోచనాపరంగా తగు రీతిలో నా శరీర సంపద ఉపయోగ పడుతుందని అందుకు సహకరిస్తారని ఆశిస్తాను. రాష్ట్రపతిగా మీరు స్వయంగా ఈ నా శరీర సంపద వినియోగ విషయంలో జోక్యం చేసుకొని నా అభీష్టానికి సహకరించండి.
ఈ విషయంలో అవసరం అయితే చట్టంలో ఏవయినా మార్పులు చేయవలసి వచ్చినా ఆ చట్ట సవరణలు చేసయినా నా సంపద పై నాకువున్న సహజ అధికారాన్ని నన్ను వినియోగించుకోనిమ్మని కోరుతూ,తమ నిర్ణయాదికారానికై,ఎదురు చూస్తుంటాను........ టైపిస్ట్ ఆగగానే సీనియర్ జైలర్ ముందుకొచ్చి పేపర్స్ అన్ని సరిగా నాలుగు సెట్లుగా సర్ది పిన్ చేసి ఖైదీ నం:842 కు అందించాడు.అతడోసారి చదివి పూర్తి సంతృప్తితో సంతకం చేసాడు.జైలర్ వాటిని భద్రంగా తీసుకొని గ్లాడ్ సాబ్ కు అందించాడు వినయంగా. "ఖైదీ నా సమక్షం లో ఎవరి వత్తిడి లేకుండా వ్రాసాడని" సర్టిఫై చేసి సంతకం చేసాడు.జమేదార్ కుర్చీ తీసుకేల్లుతున్నాడు,గ్లాడ్ బయటకు వెళ్లబోయే వాడల్లా ద్వారం వద్ద ఆగి ఓ క్షణం ఖైదీ కేసి నఖ శిఖ పర్యంతం పరిశీలించాడు.ఒకఆడుగు ఖైదీ కేసి వేసి చేతిలోని క్యాప్ స్టన్ సిగరెట్ టిన్ నక్సలైట్ కేసి చూపుతూ అన్నాడు " డూ యూ లైక్ ఇట్ ".
ఏదో గొణుక్కుంటూ పట్నాయక్ ఓ సిగరెట్ అందుకున్నాడు. వెంటనే పూర్తి టిన్ను ఖైదీ చేతిలో ఉంచుతూ "కీప్ ఇట్ విత్ యూ "అంటూ గ్లాడ్ సబ్ బయటకు నడిచాడు...................
మై డియర్ ఫ్రెండ్స్ నేను ఈ మృత్యుపత్రం(వీలునామా) ను మరాటి లో అనీల్ బర్వే వ్రాసిన'థాంక్ యు మిస్టర్ గ్లాడ్' కు శ్రీమతి కె.సుజనాదేవి తెలుగు సేతలో చదివాను. నన్ను ఉద్విగ్న పరచింది ఈ రచన దాంతో మీకు కూడా పరిచయం చేయాలనిపించి మీ ముందుంచుతున్నాను. నాద్రుస్టిలో అనీల్ బర్వే ఇప్పుడు లేడు కాబట్టి ఈ రచనతో ఆతని జన్మ ధన్యమయినదని భావిస్తూ అతనికి జోహార్లు చెప్పుతున్నాను.ఇకపోతే సుజనాదేవి గారు ఈ నవలను తెలుగు చేయడం ద్వారా ఆమె తెలుగు రచనా రంగానికి యెనలేని సాహితీ సేవ చేసారని భావిస్తూ ఆమెకు రెండు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. .........
No comments:
Post a Comment