పూర్వం చోళ రాజ్యాన్ని ప్రసేనుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు.అతని తండ్రి అనంతుడు రాజ్యవిస్తరణ కాంక్షతో చోళ రాజ్యం చుట్టు పక్కల వున్న చిన్న చిన్న రాజ్యాలనన్నిటిని యుద్ధంలో జయించి తన రాజ్యంలో కలిపేసుకున్నాడు.చోళ రాజ్యాన్ని మహా సామ్రాజ్యంగా చేసాడు అనంతుడు.కొంత కాలం గడచినా తర్వాత వ్రుద్దాప్యంతో అనంతుడు కాలం చేసిన తర్వాత ప్రసేనుడు అధికారంలోకి వచ్చాడు.ప్రసేనుడు కూడా రాజు అయిన కొత్తలో అనేక యుద్దాలు చేసి రాజ్యాన్ని విస్తరించాడు.ఆ తర్వాత ప్రసేనుడు యుద్దాలు ఆపి తన సామ్రాజ్యంలో పరిపాలన పటిష్టం చేయడానికి కృషి జరపనారంభించాడు
ఒకరోజు ప్రసేనుడు తన సామంతులతోనూ,మంత్రి,సైన్యాదక్షుడితో కలసి,వంది మాగతులతో నిండుగా కొలువుతీరి సామ్రాజ్యంలో విశేషాల గురించి తెలుసుకుంటున్నాడు,సరిగా ఆ సమయంలో ఓ పుట్టి గుడ్డివాడొకడు - ఆదుకోండి చక్రవర్తి,ఆదుకోండి.నన్నాదుకుంటే ఆ భగవంతుడు మిమ్ములను ఆదుకుంటాడు.మహారాజా ఆదుకోండి! నేను పుట్టుగుడ్డివాడిని,నా బతుకు మరీ దుర్లభముగా వుంది.మీరే నన్నాదుకోవాలి,నాకేదో ఒక దారి చూపాలి అంటూ వేడుకున్నాడు. నిండు పెరోలగంతో వున్న మహారాజు ప్రసేనుడు ఒక్క క్షణం ఆలోచించి తన ఔదార్యాన్ని ప్రకటించుకోవడానికి ఈ సన్నివేశం బాగానే ఉంటదని తలచి, అలాగే కానీ రాజాశ్రయం పొందాలంటే నీకేదన్న విశిష్టత వుండాలి కదా,కేవలం అంగ వైకల్యం ఒక్కటే సరిపోదు కదా?నీకేవన్నా విద్యలు తెలుసా? కనీసం వేటిలోనన్నా ప్రవేశమన్నా ఉందా? అని ప్రశ్నించాడు ప్రసేనుడు. అంతట గుడ్డివాడు - మహారాజా! నాకు వజ్రాల గురించి కొంత శాస్త్రం తెలుసు,అలాగే అశ్వాల గురించి కూడా కొంతవరకు తెలుసు అన్నాడు.మహారాజు ప్రసేనుడు ఆహా! అలాగా అయితే నీకు నెలకు ఒక వర ఇస్తాము మా ఆస్థానములో వుండు.అని నిండు సభలో ప్రకటించి సభికుల అందరి ప్రశంసలు అందుకున్నాడు ప్రసేన మహారాజు.
కొంత కాలం గడిచింది.ఒకనాడు మహారాజు ప్రసేనుడు కొలువుతీరి వున్నాడు. నిండు సభలోకి నలుగురు గ్రామీణులు ప్రవేశించి మహారాజ! మేము పొలంలో పని చేస్తుండగా ఒక వజ్రం దొరికింది.దానిని మన రాజ్యంలోని వజ్ర వ్యాపారులు కొనలేము ఇది మహాప్రభువులు తప్ప ఎవరు కొనలేరు అని చెబుతున్నారు,తమరు ధర్మప్రభువులు మీరు ఈ వజ్రాన్ని తీసుకొని మాకు సముచిత పైకం ఇవ్వగలరు అని వేడుకున్నారు.అంతట ప్రసేనుడు, నగరంలోని వజ్రాల వ్యాపారులను పిలిపించి ఈ వజ్రానికి సరయిన ధరనిర్ణయించ మని ఆజ్ఞాపించాడు. ఆతర్వాత కొద్ది సమయంలోనే ప్రసేనుడికి ,గుడ్డివాడు తనకు వజ్రాల విషయంలో కొంత పరిజ్ఞానం వుందని చెప్పిన విషయం గుర్తుకు వచ్చి,అతనిని ప్రవేసపెట్టమన్నాడు. బటులు గుడ్డివాడిని దర్భారులోకి తీసుకువచ్చారు.మహారాజు - ఏమోయి నీకు వజ్రాల విషయం తెలుసునన్నావు గదా అదిగో ఆ వజ్రం విషయంలో నీ అభిప్రాయం చెప్పు అన్నాడు.దానికి గుడ్డివాడు - మహాప్రభో ఆ వజ్రాన్ని నాచేతిలో పెట్టమనండి,అలాగే ఆ వజ్రం గురించి పైకి కనిపించే విశేషాలు నాకు చెప్పమని వజ్రవ్యాపార ప్రముఖులతో చెప్పండి అన్నాడు.అందుకు ప్రసేనుడు ఆవిధంగా చేయమని ఆజ్ఞాపించాడు. వ్యాపారులు ఆ వజ్రం విశేషణాలు,వన్నెలు,ఇతేరేతర వివరణలతో చేభుతున్నారు గుడ్డివాడు ఆ మాటలు వింటూనే వజ్రాన్ని ఆచేతిలోనించి ఈ చేతిలోకి అటు ఇటు పదే పదే మారుస్తున్నాడు.ఆ విధంగా మార్చి మార్చి మహాప్రభో ! ఈవజ్రం ఎక్కడ వుంటుందో అక్కడ అరిష్టం వుంటుంది, దరిద్రం తాండవిస్తుంది.ఇది కొనరాదు అన్నాడు.అప్పుడు ప్రసేనుడు -నీవు ఏమి మాట్లాడుతున్నావు,ఇందరు వజ్ర వ్యాపార ప్రముఖులకు తెలియని విషయం నీకు ఒక్కడికే తెలిసిందా?ఏమిటి దానిలోని లోపం నీవు సరిగా చెప్పకపోతివా నీ అవాకులు చెవాకులకు నీకు కటిన శిక్ష విధించవలసి వుంటుంది.జాగ్రత్త అన్నాడు.దానికి గుడ్డివాడు - మహారాజ మీ ఉప్పుతిని బతుకుతున్నవాడిని మీ ముందు నేను సత్యం తప్ప వేరేది చెప్పలేను ఈ వజ్రాన్ని మధ్యకు కోస్తే తేలుతుంది దీని మధ్యలో చిన్న కప్పవుంది.ఇది అరిష్టం నిజం తేల్చండి.నేనయితే చెప్పింది తప్పని తేలితే ఏ శిక్ష కయినా సిద్దం అన్నాడు.రాజాజ్ఞ మేరకు వజ్రాన్ని కోయిన్చాగా గుడ్డివాడు చెప్పింది అక్షర సత్యంగా తేలింది.ప్రసేనుడు గుడ్డివాడిని మెచ్చుకొని అతనికి ఈ నెల నుండి మరో వర అదనంగా ఇవ్వమని ఆజ్ఞాపించాడు.దానికే గుడ్డివాడు మహా ప్రభువుల దయ అంటూ సంతోషంగా బటుల సాయంతో దర్బారు నుంచి బయటకు వెళ్ళిపోయాడు.
ఆవిధంగా ప్రసేన మహారాజు ఆస్థానంలో గుడ్డివాడు తన బతుకును కొంతవరకు సంతృప్తిగా కొనసాగిస్తున్నాడు. ఒకరోజు మహారాజు దర్బారుకు గుడ్డివాడిని బటులువచ్చి తీసుకు వచ్చారు.ఆ సమయంలో కొందరు గ్రామీణులు ఒక తెల్లని గుర్రాన్ని తీసుకు వచ్చి మహారాజ! తమ వంటి ధర్మ ప్రభువుల ఆశ్వశాలలో ఉండవలసిన మేలుజాతి అశ్వం ఒకటి మాదగ్గర వుంది. తమరు ఈ ఆశ్వ రాజాన్ని తీసుకొని ధర్మప్రభువులు మాకు తగు పారితోషికం ఇవ్వమని ప్రాదేయపడుతున్నారు.అప్పుడు ప్రసేనుడుకి,గుడ్డివాడు తనకు ఆశ్వ శాస్త్రం తెలుసు అన్న విషయం గుర్తొచ్చి పిలిపించాడు. ... గుడ్డివానితో... మహారాజు ...యోమోయ్,బాగున్నావా,నీకు సరయిన ఆదరణ లభిస్తుందా?అని కుశల ప్రశ్నలు వేసి, సరే విషయానికి వస్తే మరల తిరిగి నీకొక పరీక్ష ఇప్పుడు మన దర్బారుకి ఒక గుర్రాన్ని తీసుకు వచ్చారు గ్రామీణులు.ఆ గుర్రాన్ని తీసుకొని సముచిత పారితోషికం ఇవ్వమని వారు అడిగుతున్నారు.నీకున్న ఆశ్వ శాస్త్ర పరిజ్ఞానంతో నీ అభిప్రాయం విన్న తర్వాతే ఆ గుర్రాన్ని తీసుకుందామని భావించి నిన్ను పిలిపించాము.నీ అభిప్రాయాన్ని తెలుపు అని ఆజ్ఞాపించాడు మహారాజు.దానికి గుడ్డివాడు - మహారాజు గారికి నాపట్ల వున్నా అభిమానానికి,నమ్మకానికి మొదట కృతజ్ఞతలు.మహారాజా! నాకు ఆ అశ్వం ఎత్తు వన్నె దాని సుడులు,కాలి ఎత్తు,గుర్రం పొడవు,తోక బారు,కన్ను తీరు,ముఖ కవళికలు తదితరవివరాలు చెప్పమని ఆదేసించండి,అలాగే ఆ గ్రామీణులను,నాతో మాట్లాడమని కూడా చెప్పండి.అని అడిగాడు.బటులతో తనను ఆ గుర్రం వద్దకు తీసుకెళ్ళమని కోరాడు.ఆవిధంగా గుర్రం వద్దకు వెళ్ళిన గుడ్డివాడు ఆ గుర్రం చుట్టూ తిరుగుతూ....గ్రామీణులను మీరు ఏమి వృత్తి చేస్తుంటారని అడిగి వివరాలు తెలుసుకున్నాడు.తరవాత మహారాజా! ఇది చూపులకు గుర్రమే కానీ,రణ క్షేత్రానికి పనికిరాదు.దీనిమీద యుద్ధానికి వెళ్ళినవాడు పరాజయం పాలవడమే కాక,కనీసం ఆ యోధుడి మృత దేహాన్ని కూడా ఇది తీసుకురాదు.యుద్ధానికి పనికి రాని గుర్రం ప్రభువుల ఆశ్వ శాలకు భారమే కానీ యోగాదాయకం కాదు అన్నాడు. అదేమిటి గుర్రం బాగానే వుంది కదా నీవు అల ఎలా చెప్పగలవు అన్నాడు మహారాజు. అంతట గుడ్డివాడు __ మహారాజా! ఇది పుట్టుకతో గుర్రమే కానీ దీనిని కన్నా తర్వాత తల్లి గుర్రం చనిపోయింది.ఇది పుట్టినప్పటినుండి దీనికి ఈ గ్రామీణులు గాడిద పాలు పట్టారు.ఇది గాడిద పాలు తాగి పెరిగింది.,దీనికి కొన్ని ఆ లక్షణాలు వచ్చాయి అన్నాడు.అందువలన దీనిని మహారాజులు తీసుకోవటం శ్రేయస్కరం కాదు.ఆ తర్వాత ఆ గ్రామీణులు ఆ మాట వాస్తవమే ఇది గాడిద పాలు తాగి పెరిగినదే అని అంగీకరించారు. దానితో ప్రసేన మహారాజు సంతోషించి,ఈ నెల నుండి మరో వర అదనంగా చెల్లించమని హుకుం జారీ చేసాడు.గుడ్డివాడు ధర్మ ప్రభువుల దయ అన్నాడు. అయితే మహారాజులో కుతూహలం పెరిగి గుడ్డివాడిని నీకు ఇంకా ఏయే విషయాలలో ప్రవేశం వుందో తెలుసుకోగోరుతున్నాను అన్నాడు.అంతట గుడ్డివాడు మహా రాజ నాకు కొంతవరకు స్త్రీల విషయంలో కూడా ప్రవేశం వుంది అన్నాడు.ఆహా! సంతోషం, తర్వాత కలుసుకుందాం అన్నాడు మహారాజు.తర్వాత గుడ్డివాడిని బటులు అతని ఆశ్రయానికి,తీసుకెళ్ళారు. కానీ దర్భారు ముగుంచి వెళ్ళిన మహారాజుకు గుడ్డివాని పట్ల ఆసక్తి పెరిగి అతనిని తన రాజ మందిరానికి పిలిపించాడు.అతనితో ఏకాంతంగా మాట్లాడుతూ తన చిన్న రాణీ విషయం నీవు స్వయంగా నాకు తెలియజేయాలి అందుకు నీకు కావలసిన ఏర్పాట్లు చేయిస్తాను,కానీ ఇది ఇతర్లకు తెలియరాదు.జాగ్రత్త అని హెచ్చరిస్తాడు.దానికి గుడ్డివాడు-- మహారాజ నేను చిన్నా రాణిగారి ఏకాంత మందిరానికి వెళ్ళాలి.ఆమెతో నేను మాట్లాడాలి.ఆ సమయంలో ఆ భవనంలో ఏఒక్క ఆడ గాని మగ కానీ మనిషే కాదు జంతువులు,పక్షులు కూడా ఉండరాదు,కనీసం ఏ పురుగు కూడా ఉండటానికి వీలులేదు అందుకు మీరు ఉత్తర్వులు జారీ చేయండి. అప్పుడు నన్ను చిన్న మహారాణి గారి మందిరంలో ప్రవేశపెట్టి కూడా వచ్చిన బటుడిని వెనక్కు వెళ్లేటట్టు చర్యలు తీసుకోవాలి.ఆ తర్వాత సరిగ్గా పది నిముషాలకు మరల ఆ బటుడు వచ్చి నన్ను తీసుకు రావాలి.తగు ఏర్పాట్లు చేయమని కోరాడు గుడ్డివాడు.ప్రసేనుడు ఆ విధమయిన చర్యలు తీసుకోమని ఆంతరంగిక సిబ్బందిని ఆదేశించాడు.ఆ ప్రకారం చిన్న రాణి గారి ఆంతరంగిక మందిరంలోనికి గుడ్డివాడు ప్రవేశించాడు. ప్రవేశించిన గుడ్డివాడు -- చిన్న రాణి గారితో అమ్మ నేను పుట్టు గుడ్డివాడిని ఇదిగో నాకళ్ళు చూడండి అని కను రెప్పలు ఎత్తి రెండు కళ్ళు చూపించాడు.రెండు లోట్టలే,తమరు ధర్మ దేవతలు, నా ఎదురు మీరు వస్త్రాలతో వున్నా వస్త్రాలు లేకుండా వున్నా నాకు ఎతేడాను వుండదు. నాకు ఏదీ కనిపించదు,అయితే శాస్త్రం కోసం నా మీద దయతో,తమరు శరీరం మీద ఏ ఆచ్చాదన లేకుండా,ఆభరణాలు కూడా తీసివేసి పుట్టినప్పుడు ఎలా శిశువు వుంటుందో అలా పూర్తిగా దిసమొలతో ఒక్క క్షణం నిలబడమని కోరుతున్నా అమ్మా! తర్వాత మీ శరీరం మీద ఎక్కడెక్కడ పుట్టుమచ్చలు వున్నాయో చెప్పి, మీరు తిరిగి మీ అలంకరణ చేసుకోవచ్చు.అమ్మా! ఇదంతా శాస్త్రం కోసమే తల్లి,రాజు గారి ఆజ్ఞ మేరకు నేను వచ్చాను.నేను పుట్టు గుడ్డివాడిని,నా విషయం లో ఏవిధమయిన సందేహం వలదు తల్లీ అన్నాడు. అంతట ఆ చిన్న రాణి మహా రాజు ఆజ్ఞ,ఇతను గుడ్డివాడి ఇంకేమి ఆలోచించకుండా ఆ విధంగానే చేసింది.తల్లి నీకు రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను.తల్లి నేను వెళతాను,అని బటుల సాయంతో తిరిగి మహా రాజ ప్రసేనుడు వద్దకు రాజ మందిరానికి వెళ్ళాడు.ఏమోయ్ విషయం చెప్పు నీ అభిప్రాయం తెలుసుకోవాలని చాలా కుతూహలంగా వుంది అన్నాడు. అంతట గుడ్డివాడు........
---మహారాజా! నేను చెప్పే విషయం మీరు ఉద్రేకానికి లోను గాకుండా వినాలి.విషయం కేవలం తెలుసుకోవడానికే కానీ,విమర్సించుకోవడానికి కాదు అని గ్రహించాలి.ధర్మ ప్రభువులు సూక్ష్మ కుశాగ్ర బుద్ధితో విషయాన్ని గ్రహించాలి అంతే అంటూ .....మహారాజా తమరి చిన్న రాణి గారు క్షత్రియ మహిళ కాదు, ఆమె దాసీ కూతురు,ఈ విషయంలో మీరు మీ అత్తగారినుండి పూర్తి సమాచారాన్ని తెలుసుకోగలరు అన్నాడు. అంతట మహారాజు ఈ విషయంలో తేడా ఏమన్నా వుంటే మాత్రం నీ తల కోట గుమ్మానికి వేలాడుతుంది జాగ్రత్త,అంటూ విషయ సేకరణకు అత్తగారి దేశానికి ప్రయాణ ఏర్పాట్లు చేసుకొని వెళ్ళాడు ప్రసేనుడు.
ప్రసేనుడు ........అత్తగారితో .....నా చిన్న రాణి నీకూతురు కాదా,నాకు వివరంగా చెప్పమని,అల్లుడుగానే కాకుండా నీదేశానికి కూడా మహా రాజునే ఆ హోదాతో కూడా ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు. అంతట ఆమె, నేను నీకు ఆ అమ్మాయి నా కూతురు అని చెప్పి మీ వివాహం చేసామా? నీవు మా రాజ్యం మీద దండెత్తి మమ్ములను వోడించి మా రాజ మందిరాన్ని స్వాదీనం చేసుకొని, నా ఆంతరంగిక మందిరంలో వున్న ఆ పిల్లను నాకూతురుగా బ్రమించి నీవు తీసుకుపోయి వివాహం చేసుకున్నావు,మేము నీ సామంతులుగా ఎదురు మాట్లాడలేక మిన్నకుండిపోయాము,ఇందులో మా తప్పేమిలేదు,ఆమె నాకూతురు కాదు,నాకసలు కూతుర్లె లేరు,ఆమె నా పుట్టింటినుండి వచ్చిన నా అరణపు దాసీ కూతురు.ఎర్రగాను,అందంగాను ఉండటంతో,నాకు కూడా ఆడ సంతానం లేకపోవడంతో దానికి నేను రాణి వాసాల్లోని మహిళలకు చేసి అన్ని అలంకరణలు చేయించి ఆనందిస్తుండే దానిని.నీవే కోరి తీసుకెళ్ళి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు మమ్ములను నిందించడం మంచిదికాదు ప్రభువులకు అన్నది అత్తగారు కాని అత్త గారు.......ప్రసేనుడు తిరిగి తన రాజ మందిరానికి వచ్చి గుడ్డివాడిని పిలిపించి,అభినందించి ఈ నెల నుండి ప్రతి నెల అదనంగా మరో వర ఇచ్చే హుకుం జారీ చేసాడు.
ఆ విధంగా కొంతకాలం గడిచాకా ఒక రోజున గుడ్డివాని గురించి మహారాజు ప్రసేనుడికి గుర్తుకొచ్చి అతనిని తన ఆంతరంగిక మందిరానికి పిలిపించుకొని, అంతరంగికంగా మాట్లాడుతూ, నా గురించి నీ అవగాహన ఏమిటి అని ప్రశ్నించాడు.దానికి గుడ్డివాడు -- తమరా మహా ప్రభూ ...తమరు ధర్మ ప్రభువులు అన్నాడు.అది కాదు, నన్ను గురించి నీ అవగాహన ఏమిటి అసలు నేను ఎవరిని నా గురించి నీకు తెలిసినది పొల్లు పోకుండా నిజం చెప్పు.ఇది దర్బారు కాదు.ఇచ్చట మనమిద్దరమే వున్నాము,వాస్తవాలే మాట్లాడుకుందాము.అబద్దాలు,ముఖస్తుతి మాటలు నాకు నచ్చవు. నీకు తెలిసినది తెలిసినట్లు,అనుకున్నది అనుకున్నట్టు చెప్పు,నిన్నేమి చేయను కానీ నాకు తర్కంతో నీ ఆలోచన కావాలి చెప్పు అని ఆజ్ఞ, హుకుం కాకుండా మహారాజు మొదటి సారి మిత్రునితో వ్యవహరిస్తున్నట్టు అడిగాడు.అంతట గుడ్డివాడు ఆ మిత్ర భందానికి లోనయినట్లు మహారాజా! నిజానికి మీరు క్షత్రియులు కాదు మీరు వ్యాపారస్తుల ( వణిక్ ) వర్ణానికి చెందినవారు.అయితే తమరు క్షాత్రము ( రాజ్యము ) కలదు కావున రాజులే,మహారాజులే అన్నాడు. అంటే అని ప్రసేనుడు ........ మహారాజా ఈ విషయంలో తమ తల్లి గారు అయిన రాణీ మాత మాత్రమే మీ సందేహాలను నివృత్తి చేయ గలరు అన్నాడు గుడ్డివాడు. అంతట కుతూహలం చంపుకోలేక ప్రసేనుడు తన తల్లి వద్దకు వెళ్లి తన జన్మ వృత్తాంతం చెప్పమని కోరగా ఆ రాణీ మాత ---నాయనా నీ తండ్రి గా చెప్పబడుతున్న అనంతుడు రాజ్యాభిశిక్తుడు అయి రాజ్యాన్ని విస్తరించాలనే కోర్కెతో చుట్టూ వున్న చిన్న రాజ్యాలపై దండెత్తి వోడించి తన రాజ్యంలో కలిపేసుకున్నాడు.ఆ విధంగా మాతండ్రి గారి రాజ్యంపయినా దండెత్తి మా తండ్రి గారి రాజ్యం కలిపేసుకొని నన్ను తన పట్టపు రాణి గా స్వీకరించి తీసుకువచ్చి తిరిగి మరలా యుద్దాలు చేయడానికి వెళ్లి రాజ్యాన్ని దశ దిసల విస్తరించాడు. అంటే గాని నన్ను ఏనాడు పట్టించుకోలా.ఒక రోజు నాకు కోర్కె కలిగి నేను చూస్తుండగా నాకు మన ఆస్థానంలో వుండే షరాబు గారు కనిపించారు ఆ సమయంలో నేను ఆయనతో కలిసాను, నీవు జన్మించావు.అందరికి నీవు మాత్రం మహారాజు అనంతుని బిడ్డవే.ఈ విషయం ఎవరికి ఆ షరాబు గారికి కానీ,మహారాజు అనంతుడికి కానీ తెలియదు అని నిజం చెప్పింది రాణీ మాత.
ఒకరోజు మహారాజు ప్రసేనుడు తన ఆంతరంగిక మందిరంలోనికి గుడ్డివాడిని పిలిపించాడు. ఏమోయ్ బాగున్నావా అని కుశల సమాచారం తెలుసుకొని, తర్వాత నాకు నీవద్ద నుండి కొన్ని వివరణలు కావాలి అందుకే నిన్ను పిలిపించాను.నాకు నీ బుద్ధి బలం పయిన నమ్మకం కుదిరినది. నీ పరిశీలనా శక్తీ పయినా విశ్వాసం వుంది.అయితే నాకు, నీవు ఏవిధంగా వజ్రం విషయం లోను,గుర్రం విషయం లోను,అటు ఇటు చూసి యెవరూ లేరని గ్రహించి చిన్న రాణి విషయం లోను,గుమ్మం వరకు వెళ్లి చూసొచ్చి నా జన్మవృత్తాంతం లోను, నీవు ఏవిధంగా చెప్పగలిగావో నాకు బోధపడటం లేదు. నీ వివరణ నన్ను సంతృప్తి పరచాలి.నీకు షరా మామూలుగా పారితోషికం పెంపుదల వుంటుంది అన్నాడు. అంతట గుడ్డివాడు చిన్నగా నవ్వి మహారాజా! నాకున్న లోకానుభవము,నా పరిశీలనా శక్తీ,దానికి తోడు నా తార్కిక అవగాహనా ఫలితమే ఆయా సందర్భాలలో నేను చెప్పినవి. వజ్రం విషయంలో,నేను ఆ వజ్రాన్ని చేతిలోకి తీసుకున్నాక దాన్ని నా రెండు చేతుల్లోకి పదే పదే మార్చాను ఆ సమయంలో నాకు వజ్రం బోలుగా వున్నట్లు అనుభవంలోకి వచ్చింది.వజ్రానికి బోలు వుందంటే తప్పనిసరిగా అందులో ఉండేవి కప్పపిల్లలే అదే నమ్మకంతో చెప్పాను.తర్వాత గుర్రం విషయంలో నేను గుర్రం గురించి అందరు చెప్పే మాటలు వింటూనేదాని చుట్టూ తిరిగాను,అది నేను కాలి వెనక బాగం లోకి వెళ్ళగానే దాని కాలు వెనక్కి జాడించి తన్నింది.అక్కడివారు చెబుతున్న దాని ప్రకారం అది గుర్రమే,మగ గుర్రానికి,ఆడ గాడిదకు పుట్టిన దానిని 'హిన్నీ' అని అంటారు.అదేవిదంగా ఆడ గుర్రానికి, మగ గాడిదకు పుట్టిన దానిని 'మ్యూల్' అని అంటారు. కానీ విశ్లేషకులు అందరు చెబుతున్న మాటల ప్రకారం అది గుర్రమే అని నాకు అర్ధమయింది. కానీ అది కాలు వెనకకు జాడించే లక్షణాన్ని బట్టి పుట్టుకతో గుర్రమయిన అది తాగిన పాలు గాడిదవే అని నాకు అవగతం అయింది అంతే కాక ఆ గుర్రాన్ని తీసుకు వచ్చిన గ్రామీణులను వాళ్ళు మాటలలో తాము బట్టలు వుతికే రజకులమని చెప్పారు, దానితో నాకు ఆ గుర్రం తల్లి చనిపోవడంతో వాళ్ళ ఇంట సహజంగా వుండే గాడిద పాలు తాగి పెరిగింది అని అర్ధమయింది. గుర్రానికి గాడిద లక్షణాలు వస్తే ఎంత ప్రమాదం సంభవిస్తుందో ఊహించి చెప్పను. ఇక పోతే చిన్న రాణి గారి విషయంలో, నేను చిన్న రాణిగారి సయన మందిరానికి వెళ్లి, నాకు కళ్ళు లేని విషయం రాణీ గారికి ప్రత్యక్షంగా చూఇంచి, నాముందు దిసమొలతో నిలబడమని,ఆమె శరీరం పయిన పుట్టు మచ్చలు ఎక్కడెక్కడ వున్నాయో చెప్పమని కోరాను,ఆమె ఆవిధంగా చేసారు. మహారాజా! క్షత్రియ స్త్రీ ఎవరు నా కోర్కెను నాకు కళ్ళున్నయా,లేవా అనేది అప్రస్తుతం అంగీకరించరు .ఒక్క దాసీలు మాత్రమే అంగీకరిస్తారు.ఆ ఆలోచనతోనే మీకుచెప్పాను .ఇక ఆకరుగా మిమ్ములను గురించి నేను మీకు ఏ విషయాన్ని గురించి చెప్పినా అవి మీకు సమ్మతమే అయినా ఒక క్షత్రియ మహారాజుగారి లాగా ఏమోయి ఈ సందర్భంగా నీకు ఇదిగో ఈ హారం బహుకరిస్తున్నాను అనలేదు,వాణిజ్య వర్ణానికి చెందిన వ్యక్తిలా ఎప్పటికప్పుడు ఒక వర వేతనం పెంచటం నన్ను ఆచ్చార్యానికి గురి చేసింది.నా వూహ కరక్ట్ అయింది.ఇప్పుడు కూడా మీరు ముందే షరా మామూలుగా వేతనం పెంపుదల ఉంటుందని ప్రకటించారు నేను ముందే నవ్వాను.మహారాజ! ఇది విషయం.ఇక తమరి చిత్తం అన్నాడు.
మిత్రులారా! ఈ కధ నా మిత్రుడు ఎం.వి.ఎల్.ప్రసాద్ ( మూల్పూరు వెంకట లక్ష్మి ప్రసాద్ ) బావ గారు నాకు ఆత్మీయుడు,గత పదేళ్ళ నుండి ఎన్నో విషయాలు కలబోసుకున్న సన్నిహితుడు ది. .27-07-2011 న గుండె పోటు తో మరణించిన గౌరవనీయులు కొడాలి వెంకట రామకృష్ణయ్య గారికి అంకితం.
( ఈ కధను ఎంతో హృద్యంగా ముప్పయి ,ముప్పైరెండేళ్ళ క్రితం నన్ను ద్వారక తిరుమల తీసుకెళ్ళి చెప్పిన నా లాయర్ ఆత్మీయుడు స్వర్గీయ ఎస్.టి.జి.భాష్యాకార్లు కు జోహార్లు చెప్పుకుంటూ, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.)