తరచూ ఆత్మవిమర్శ పేరుతో తమ అసమర్ధతను విమర్సించుకొంటు ఉండేవారిలో ఆత్మవిశ్వాసం క్షీణిస్తుంది.
చివరకు వారు ఏ చిన్న నిర్ణయం తీసుకోలేక ఊగిసలాట మనస్తతత్వం ప్రదర్చిన్చుతారు.
ఉద్రేక ఉద్వేగాలకు లోనయినప్పుడు విషయ నిర్నాయిక శక్తి కుంటుపడుతుంది.
కోపంలోవున్న మనిషి పంచేంద్రియాలు అందించే సమాచారాన్ని మెదడు సద్వినియోగం చేసుకోదు.
అందువల్ల ఆ పరిస్థితుల్లో ఏదయినా సమస్యను పరిష్కరించుకోవటానికి ప్రయత్నిస్తే గుడ్డిగా ప్రవర్తిస్తారు.
సమస్యను అన్ని ద్రుక్కోనాలనుండి పరిశీలించినప్పుడు సమగ్రంగా అవగాహనా చేసుకోవడానికి వీలు కలుగుతుంది. సమస్యను సమగ్ర పరిశీలనా చేయకుండా ఒక్క దృక్కోణం నుండి మాత్రం పరిశీలించి పరిష్కరించడానికి పయత్నిస్తే తప్పుడు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం వుంది. అట్లా అని ప్రతి
చిన్న సమస్యను అతిగా విశ్లేషిస్తే అమూల్యమయిన కాలాన్ని నష్టపోయే ప్రమాదముంది.
అతి ప్రాముఖ్యం గల సమస్యలకు సమగ్ర పరిశీలన అవసరం
సాదారణ సమస్యలకు సత్వర నిర్ణయాలు అవసరం. కాదని సమగ్ర పరిశీలన నెపంతో కాలయాపన చేయటం కాలాన్ని నష్టపోవడం మాత్రమె కాదు. సమస్యను కుడా జటిలం చేయటం అవుతుంది.జాగ్రత్త.
.
No comments:
Post a Comment